వేటపాలెంలో ఏం జరిగింది?

6 Apr, 2016 22:20 IST|Sakshi
వేటపాలెంలో ఏం జరిగింది?

 అమ్మా నాన్నా అనే పిలుపుకు దూరమై, మంచీ చెడుల తేడా తెలియని కొంత మంది పిల్లలు క్రిమినల్స్‌గా మారుతున్నారు. అలాంటి వాళ్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారనే కథాంశంతో తెరకెక్కిన చిత్ర ం ‘వేటపాలెం’. ప్రశాంత్, లావణ్యా, శిల్ప నాయకా నాయికలుగా నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో డా. ఎ.వి.ఆర్  నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా కమర్షియల్ హంగులను జోడించి తెరకెక్కించాం. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తంగిరాల అపర్ణ.