ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం

10 Aug, 2019 16:02 IST|Sakshi

ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాసిన్హా(71) అనారోగ్యం పాలవడంతో ముంబైలోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గుండె, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాదులతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. శనివారం పల్స్‌రేట్‌ పడిపోవడంతో ముంబైలోని క్రిటికేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

కాగా, విద్యాసిన్హా బాలీవుడ్‌లో 27 ఏళ్లకు హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించినా అనతికాలంలోనే మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చోటీసీ బాత్‌, రజనీ గంధ, పతి పత్ని ఔర్‌వో అనే చిత్రాలు ఆమె కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్లుగా నిలిచాయి. ఫిలింఫేర్‌ అవార్డు గెలుచుకున్న 'రజనీగంధ'లో విద్యాసిన్హా నటనకు వ్రశంసలు లభించాయి. సినిమాలో అవకాశాలు తగ్గాక ఆమె కెరీర్‌ను బుల్లితెరవైపుకు మరల్చారు. ప్రస్తుతం స్టార్‌ ప్లస్‌ టెలివిజన్‌లో ప్రసారమయ్యే 'కుల్ఫీ కుమార్‌ భాజేవాలా' అనే షోలో గ్రాండ్‌ మదర్‌ పాత్ర చేస్తున్నారు. ఈమె నటించిన హిట్‌ చిత్రం 'పతి పత్నీ ఔర్‌ వో'ను ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు