అతని కోసం గుడికి..

18 Jan, 2018 05:09 IST|Sakshi

నయనతార ఈ మధ్య ఓ గుడికి వెళ్లారు. ఎందుకు వెళ్లారంటే ‘తానా సేంద కూట్టమ్‌’ హిట్టవ్వాలని. తెలుగులో ‘గ్యాంగ్‌’ పేరుతో రిలీజైంది. సూర్య హీరోగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్‌ కథానాయికగా నటించారు. మరి.. నయనతార ఎందుకు గుడికి వెళ్లారూ అంటే... విఘ్నేష్‌ శివన్‌ కోసమని చెన్నై టాక్‌. ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ సంగతలా ఉంచితే ‘తానా సేంద...’ సూపర్‌ హిట్‌. అంటే.. చిత్రబృందం కష్టానికి నయనతార పూజలు తోడయ్యాయా!

మరిన్ని వార్తలు