సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

20 Jul, 2019 11:20 IST|Sakshi

సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొండ, లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం డియర్‌ కామ్రేడ్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో భరత్ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాసల్లో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతీ స్టేట్‌లో మ్యూజిక్‌ ఫెస్టివల్‌ పేరుతో ఈవెంట్స్‌ను నిర్వహించిన చిత్రయూనిట్‌ ఈసినిమా మంచి హైప్‌ క్రియేట్‌ చేశారు. తాజాగా డియర్‌ కామ్రేడ్‌ సెన్సార్‌ కార్యక్రామలు పూర్తి చేసుకుంది. 2 గంటల 49 నిమిషాల నిడివిగల ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. మరి ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ మరోసారి సెన్సేషనల్‌ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

మరిన్ని వార్తలు