సరదాగా ఓ సాంగ్‌

24 Jul, 2018 00:30 IST|Sakshi
విక్రమ్‌, కీర్తీ సురేశ్‌

‘గారెలు, బూరెలు, చక్రాలు, చక్కలు.... ఇవన్నీ డూపే పిజ్జాయే టాపు..’ అంటూ ‘మల్లన్న’ సినిమాలో తెలుగు ఆడియన్స్‌కు తనలోని గాయకుడిని కూడా పరిచయం చేశారు విక్రమ్‌. ‘సామీ స్క్వేర్‌’ సినిమా కోసం మరోసారి ఓ పాటను సరదాగా పాడారు విక్రమ్‌. హీరోయిన్‌ కీర్తీ సురేశ్‌తో కలిసి ‘పెణ్ణే’ అని సాగే సరదా పాట పాడారు. కీర్తీ సురేశ్‌ స్క్రీన్‌పై పాడటం ఇది ఫస్ట్‌ టైమ్‌.  విక్రమ్, కీర్తీ సురేశ్, ఐశ్వర్యా రాజేశ్‌ ముఖ్య పాత్రల్లో దర్శకుడు హరి రూపొందించిన యాక్షన్‌ చిత్రం ‘సామీ స్క్వేర్‌’.  2003లో వచ్చిన  సూపర్‌ హిట్‌ చిత్రం∙‘సామీ’కి ఇది సీక్వెల్‌. ఇందులో ‘పెణ్ణే...’ అంటూ సాగే ఓ  పాటను హీరోహీరోయిన్‌లు కలిసి పాడారు.  ఈ సినిమా తమిళ ఆడియో వేడుక సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఈ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఇవే కాకుండా ఇది వరకు తను యాక్ట్‌ చేసిన ‘జెమినీ’ టైటిల్‌ సాంగ్‌తో పాటు రీసెంట్‌గా ‘స్కెచ్‌’ సినిమాలో పాటలను పాడారు విక్రమ్‌. అలాగు తమిళంలో సూర్య యాక్ట్‌ చేసిన ‘శ్రీ’కి కూడా విక్రమ్‌ ఓ పాట పాడారు.
∙కీర్తీ సురేష్, విక్రమ్‌

మరిన్ని వార్తలు