ముహూర్తం కుదిరింది

11 May, 2019 01:24 IST|Sakshi

విశాల్, తన ప్రేయసి అనీషా ఒక్కటయ్యే తేదీ ఖరారయింది. అక్టోబర్‌లో వీరు పెళ్లిపీటలు ఎక్కనున్నారు. విశాల్, ‘పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ అనీశా ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అక్టోబర్‌ 9న పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నాయి ఇరు కుటుంబాలు. తమిళ నడిగర్‌ సంఘం (నటీనటుల సంఘం) బిల్డింగ్‌ పనులు పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్‌ ఆ మధ్య ప్రకటించారు. మరో నాలుగైదు నెలల్లో బిల్డింగ్‌ పనులు కూడా పూర్తవుతాయని తెలిసింది. 

మరిన్ని వార్తలు