ప్రేమతో...!

4 Aug, 2019 06:05 IST|Sakshi
తమన్నా, విశాల్‌

జైపూర్‌లో ప్రేమాయణం సాగిస్తున్నారు విశాల్‌. సుందర్‌. సి దర్శకత్వంలో విశాల్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజస్థాన్‌లోని జైపూర్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. విశాల్, తమన్నాలపై లవ్‌ సీన్స్‌ను తీస్తున్నారట. ఈ షెడ్యూల్‌లోనే నటి ఖుష్బూ కూడా పాల్గొంటున్నారు. దాదాపు నెలరోజుల పాటు ఈ  జైపూర్‌ షెడ్యూల్‌ సాగుతుందని కోలీవుడ్‌ టాక్‌.

మరిన్ని వార్తలు