సరికొత్తగా 'దూసుకెళ్తా'

18 Sep, 2013 00:49 IST|Sakshi
సరికొత్తగా 'దూసుకెళ్తా'
 ‘దేనికైనా రెడీ’ విజయం తర్వాత మంచు విష్ణు తన కెరీర్‌ని ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. తన శారీరక భాషకు నప్పే విధంగా యాక్షన్ ఎంటర్‌టైనర్లు చేయాలని విష్ణు నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ‘దూసుకెళ్తా’ సినిమా చేస్తున్నారు.
 
 పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘బిందాస్’, ‘రగడ’ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల ‘దూసుకెళ్తా’లో విష్ణుని సరికొత్త రీతిలో ఆవిష్కరిస్తున్నారు. ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠి ఇందులో కథానాయిక. 
 
 ఆరియానా-వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉంది. టైమ్స్ మ్యూజిక్ ఆధ్వర్యంలో ఈ నెలాఖరున పాటలు విడుదల కానున్నాయి. మణిశర్మ స్వరాలందించారు. అక్టోబర్ రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. 
 
>