విట్టల్‌ వాడిలో ఏం జరిగింది?

15 Mar, 2020 05:49 IST|Sakshi
రోహిత్, సుధా రావత్‌

రోహిత్‌ రెడ్డి, సుధా రావత్‌ జంటగా నటించిన చిత్రం ‘విట్టల్‌ వాడి’. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతం పేరు విట్టల్‌ వాడి. ఆ నేపథ్యంలోనే సినిమా ఉంటుంది. ఎన్‌.ఎన్‌. ఎక్స్‌పీరియన్స్‌ ఫిలిమ్స్‌ పతాకంపై జి.నరేశ్‌ రెడ్డి నిర్మించారు. నాగేందర్‌ దర్శకత్వం వహించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రోహిత్‌ మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనలతో రూపొందించిన చిత్రం ఇది. నాగేంద్ర బాగా తెరకెక్కించారు’’ అన్నారు. నాగేంద్ర మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత నరేశ్‌ గారికి థ్యాంక్స్‌. రోహిత్‌ ఈ కథకు కరెక్ట్‌గా సరిపోయాడు. కొత్త హీరో అయినా అనుభవం ఉన్న నటునిలా నటించారు’’ అన్నారు. ‘‘రియల్‌ ఇన్సిడెంట్‌లతో తీసిన ఈ సినిమాని చాలా సహజంగా తెరకెక్కించారు దర్శకుడు’’ అన్నారు నరేశ్‌.

మరిన్ని వార్తలు