ఆ వార్తల్లో నిజం లేదు : వైజయంతీ మూవీస్‌

11 Oct, 2018 17:27 IST|Sakshi

మహానటి సినిమాను నిర్మించి టాలీవుడ్‌లో మళ్లీ తన సత్తాను చాటుకుంది వైజయంతీ మూవీస్‌. ఒకప్పుడు తిరుగులేని హిట్‌లు ఇచ్చిన ఈ సంస్థ గత కొంతకాలంపాటు విజయాలను అందించలేకపోయింది. మహానటి ఇచ్చిన కిక్‌తో మళ్లీ వరుసబెట్టి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తోంది. రీసెంట్‌గా ‘దేవదాస్‌’ తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సంస్థ ప్రస్తుతం మహేష్‌ బాబు ‘మహర్షి’ సినిమాను నిర్మిస్తోంది. 

అయితే సోషల్‌ మీడియాలో బుధవారం రోజున ఓ వార్త హల్‌చల్‌ చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి తన 152వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్‌లో వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తోందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. తాము చిరంజీవి 152వ సినిమాను నిర్మించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ.. మెగాస్టార్‌తో ఇప్పటికే నాలుగు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాలు చేశామని, ఐదో బ్లాక్‌బస్టర్‌ సినిమా చేస్తే తామే గర్వంగా ప్రకటిస్తామంటూ ట్వీట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు