‘కార్తికేయ2’కు నిర్మాత ఆయనేనా?

3 Jun, 2018 08:48 IST|Sakshi

నిఖిల్‌ హీరోగా నటించిన ‘కార్తికేయ’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చందూ మొండేటి దర్శకత్వంలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం నిఖిల్‌ తమిళ్‌ రీమేక్‌ మూవీలో నటిస్తున్నారు. చందూ మొండేటి సవ్యసాచి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 

ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన తరువాత కార్తికేయ2 ను ప్రారంభిస్తారని సమాచారం. ఈ సినిమాకు నిర్మాతగా నైజాం డిస్ట్రిబ్యూటర్‌ సునీల్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. సునీల్‌ నిర్మాణ రంగం వైపు ఆలోచిస్తుండగా.. కార్తికేయ2 స్క్రిప్టు నచ్చి ఈసినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు