జీసెస్ మహిమలతో...

9 Jul, 2014 23:47 IST|Sakshi
జీసెస్ మహిమలతో...

క్రీస్తు మహిమల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వాసి’. సుధీర్ నీరుడు ఈ చిత్రానికి దర్శకుడు. శేఖర్ నిర్మాత. సికింద్రాబాద్‌లోని క్రైస్తవ మతపెద్దల సమక్షంలో ఈ చిత్రం పాటల్ని విడుదల చేశారు. ఫాదర్ బాలశౌరి, పాస్టర్ శ్యామ్‌కిషోర్ పాటల సీడీని ఆవిష్కరించారు. క్రైస్తవం గొప్పతనాన్ని తెలిపే సినిమాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఫాదర్ బాలశౌరి అన్నారు. ఆదర్శప్రాయంగా ఉండే ఈ చిత్రాన్ని ఆదరించాల్సిన బాధ్యత అందరిదీ అని పాస్టర్ శ్యామ్‌కిషోర్ పేర్కొన్నారు. విశ్వాసం గొప్పతనాన్ని, బలాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో తీస్తున్న సినిమానే ఈ ‘విశ్వాసి’ అని నిర్మాత చెప్పారు.     ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ మాచినేని, సంగీతం: అద్దంకి రాము.