'ఫిదా' బాన్సువాడ షెడ్యూల్ పూర్తి

8 Sep, 2016 17:23 IST|Sakshi
'ఫిదా' బాన్సువాడ షెడ్యూల్ పూర్తి

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'ఫిదా'  మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో 'ప్రేమమ్' ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్గా మెరవనున్నారు. ఎన్నారై కుర్రాడికి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

నిజామాబాద్ బాన్సువాడలో మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకున్నట్లు వరుణ్ తేజ్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. శేఖర్ కమ్ముల మార్క్ స్వీట్ లవ్ స్టోరీగా 'ఫిదా' అలరించనుంది.