రానా సునీల్ కుమార్ సింగ్, వైభవీ జోషి, శ్రీజిత జోషి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. మీనా బజార్’. రానా సునీల్ కుమార్ దర్శకత్వంలో నాగేంద్ర సింగ్ నిర్మించారు. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ – ‘‘మా చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. సెన్సార్ పనులు పూర్తయ్యాయి. మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నాం. మా సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.