విశ్వనట చక్రవర్తికి వైఎస్‌ జగన్‌ నివాళి

3 Jul, 2018 14:10 IST|Sakshi

సాక్షి, రామచంద్రాపురం: తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అజరామర పాత్రల్లో అలరించిన మహానటుడు, విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు. ఆయన శత జయంతి సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నివాళులర్పించారు. ‘తెలుగు, తమిళ సినీరంగాలకు చెందిన మహానటుడు ఎస్వీరంగారావుగారి శతజయంతి పురస్కరించుకొని ఆయన్ను స్మరించుకుందాం’ అంటూ ఓ ట్వీట్ చేశారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు.

మరిన్ని వార్తలు