సాక్షి, నాగర్కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కారుకొండ గ్రామంలో శనివారం ఓ వ్యక్తి సజీవ దహమయ్యాడు. రాళ్ల లోడ్తో వెళ్తున్న టిప్పర్కు 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో టిప్పర్తో సహా డ్రైవర్ లైకేష్ విశ్వకర్మ సజీవ దహనమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.