పలు పోటీల్లో రాణిస్తున్న
పేద విద్యార్థులు
ప్రతిభను చాటి జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక
జిల్లా, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పతకాల సాధనలో కీలక పాత్ర
పేదింటి విద్యార్థులు పలు క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. సంక్షేమ హాస్టళ్లలో వసతి పొందుతూ.. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. ఉన్న కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పతకాలు సాధించారు. నిరంతరం సాధన చేస్తూ.. దేశజట్టుకు పాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
సాక్షి, నల్లగొండ : పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన దగ్యాల సాయికిరణ్ నల్లగొండలోని బీసీ వసతిగృహంలో ఉంటూ స్థానిక బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి క్రీడల్లో ఉన్న ఆసక్తితో కబడ్డీలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనభర్చి పలు పతకాలు కైవసం చేసుకున్నాడు. ఎప్పటికైనా దేశం తరపున కబడ్డీ పోటీల్లో పాల్గొనడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.
సాయికిరణ్ పాల్గొన్నపోటీలు..
కబడ్డీలో రాణిస్తున్న మధు
నల్లగొండ టూటౌన్ : పెద్దవూర మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన తరి మధు నల్లగొండలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతూ స్థానిక ఎస్సీ వసతి గృహంలో ఉంటున్నాడు. కబడ్డీ మీద మక్కువతో పలు పోటీల్లో రాణించి.. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. కబడ్డీతో పాటు వెయిట్ లిఫ్టింగ్లో కూడా రాణిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో దేశం తరపున ఆడాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతున్నాడు.
మధు పాల్గొన్న పోటీలు..
ఫుట్బాల్లో గోల్డ్మెడల్ సాధించిన సాయిచంద్రసిద్దార్థ
నల్లగొండకు చెందిన బొమ్మపాల సాయిచంద్రసిద్దార్థ ఫుట్బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ చాటుతున్నాడు. 2016లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఫుట్బాల్ అకాడమీకి ఎంపికైన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. పలు జాతీయ క్రీడాపోటీల్లో పాల్గొని గోల్డ్మెడల్ సాధించాడు.
సిద్దార్థ పాల్గొన్న పోటీలు..
జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణం
ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ పేదింటి పిల్లలు జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎదగడం ఎంతో గర్వకారణం. రోజూ వీరి కోసం ఛత్రపతి శివాజీ కబడ్డీ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి క్రీడల్లో ప్రోత్సహిస్తున్నాను. వేసవికాలంలో కూడా 30 మంది విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తూ క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నాం. తమ పాఠశాల నుంచే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు నలుగురు విద్యార్థులు ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు పట్టుదలతో సాధన చేస్తున్నారు. – బొమ్మపాల గిరిబాబు, కబడ్డీ కోచ్, పీఈటీ, బొట్టుగూడ