సీబీఐకి 10% నిధుల పెంపు

1 Mar, 2015 02:06 IST|Sakshi
సీబీఐకి 10% నిధుల పెంపు

న్యూఢిల్లీ: దేశంలో కీలక దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి బడ్జెట్‌లో రూ.565.39 కోట్లను కేటయించారు. ఇది గత ఏడాది కేటాయించిన రూ.513.07 కోట్ల కంటే 10 శాతం ఎక్కువ. గత బడ్జెట్‌లో రూ.520.56 కోట్లు కేటాయించగా, తర్వాత రూ.513.07 కోట్లుగా సవరించారు. ఈ నిధులను అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల అవినీతి కేసులు, ఇతర తీవ్రమైన నేరాల దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌కు వినియోగిస్తారు. అలాగే ఈ-గవర్నెన్స్, శిక్షణా కేంద్రం ఆధునీకరణ, ఫోరెన్సిక్ యూనిట్లు, కార్యాలయాల నిర్మాణాలకు వాడతారు.

మరిన్ని వార్తలు