స్లోగన్‌ చెబితే.. చికెన్ లెగ్ పీస్‌పై డిస్కౌంట్

21 Feb, 2019 12:41 IST|Sakshi

జగ్దల్‌పుర్‌(ఛత్తీస్‌గఢ్‌) : పుల్వామా దాడి తర్వాత దేశమంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని చాలా మంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎటు చూసినా పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. 

ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పుర్‌లో అంజల్ సింగ్ అనే ఓ ఫుడ్‌స్టాల్ ఓనర్ కూడా తన దగ్గరికి వచ్చే కస్టమర్లలో దేశభక్తిని రగిల్చే పనిలో పడ్డాడు. పాకిస్తాన్ ముర్దాబాద్ అనండి.. చికెన్ లెగ్ పీస్‌పై రూ.10 డిస్కౌంట్ పొందండి అంటూ ఓ ఆఫర్ ప్రకటించాడు. పాకిస్తాన్ ఎప్పుడూ మానవత్వానికి విలువ ఇవ్వలేదు. ఇవ్వదు కూడా, అందుకే ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ ముర్దాబాద్ అనాలి అని అంజల్ సింగ్ అంటున్నాడు. ఢిల్లీలో కూడా ఓ సేల్స్‌మెన్‌ పాకిస్తాన్‌ ముర్దాబాద్‌.. 1100లకే మూడు జతల షూ అంటూ తన షాపులోకి కస్టమర్లను ఆహ్వానించిన ఓ వీడియో వైరల్‌ అయింది.

చదవండి : పాకిస్తాన్‌ ముర్దాబాద్‌.. 1100లకే మూడు జతల షూ!

మరిన్ని వార్తలు