భారత్‌లో కొత్తగా 11,929 కరోనా కేసులు

14 Jun, 2020 09:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. నిన్న 11,458 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 11,929 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.  భారత్‌లో గడిచిన 24 గంటల్లో 311 మంది, ఇప్పటివరకు 9195 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,49,348గా ఉంది. కరోనానుంచి కోలుకుని మొత్తం 1,62,378 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా, కరోనా కేసుల సంఖ్య నిన్న 3 లక్షలు మార్కు దాటిపోయి ప్రపంచ జాబితాలో భారత్‌ నాలుగో స్థానానికి చేరుకుంది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత స్థానంలో భారత్‌ ఉంది.

చదవండి : 3 కేసులు...3 లక్షలు

మరిన్ని వార్తలు