కశ్మీర్లో పేలుడు: 12మంది జవాన్లకు గాయాలు

29 Aug, 2015 11:34 IST|Sakshi

శ్రీనగర్:  జమ్ము, కశ్మీర్ పుల్వామా జిల్లాలోని ఆర్మీ క్యాంప్లో శనివారం పేలుడు సంభవించింది.   ప్రమాదవశాత్తు  జరిగిన ఈ పేలుడులో 12   మంది జవాన్లు గాయపడ్డారు.  వీరిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.  దక్షిణ కశ్మీర్లోని అవంతిపురా ఏరియాలోని పుల్వామాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.  ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు  సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాగా   పేలుడుకు గల  కారణాలు చెప్పలేమని, విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు