కోరాపుట్‌లో 12 మంది మావోల లొంగుబాటు

9 Jun, 2014 01:56 IST|Sakshi

కోరాపుట్ (ఒడిశా): జనజీవన స్రవంతిలో కలవాలనే ఆకాంక్షతో ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పోలీసుల ఎదుట ఆదివారం 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా ఆంధ్రా-ఒడిశా బోర్డర్ ప్రత్యేక జోనల్ కమిటీ ఆధ్వర్యంలోని శ్రీకాకుళం-కోరాపుట్ డివిజన్ కమిటీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారు కోరాపుట్ జిల్లా నారాయణపట్న నివాసులని వెల్లడించారు.

వీరు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించడమే కాకుండా మావోలకు సమాచార వ్యవస్థను రూపొందించేవారని చెప్పారు. ఈ 12మందితో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో మొత్తం 33 మంది మావోలు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. మావోయిస్టులందరూ హింసను విడనాడి జనజీవనస్రవంతిలో కలవాలని పోలీసులు పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు