లోయలో పడ్డ వ్యాను.. 13 మంది మృతి

3 Sep, 2018 18:18 IST|Sakshi

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉత్తర్‌కాశి జిల్లాలో వ్యాను లోయలో పడి 13 మంది మృతిచెందారు. బట్వాడీలో సోమవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో ఓ వ్యాను అదుపుతప్పి లోయలో పడిపోయింది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతిచెందగా, బట్వాడీలోని బకోలీ గ్రామానికి చెందిన 13 ఏళ్ల మీనాక్షి, రాధలు ప్రాణాలతో బయటపడ్డారు.

మరిన్ని వార్తలు