బస్సు లోయలో పడి 13మంది మృతి

7 May, 2014 17:15 IST|Sakshi
ఉత్తరాఖండ్ లో దేవప్రయాగ వద్ద ఒక బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోతున్న లోయలో పడిపోవడంతో 13 మంది చనిపోయారు. 27 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్ రోడ్ వేస్ కి చెందిన ఈ బస్సు ఢిల్లీ నుంచి గుప్త కాశీకి వెళ్తూండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
మృతుల భౌతికకాయాలను పోలీసులు తీసుకువచ్చారు. గాయపడిన వారిలో కొందరికి దేవ ప్రయాగలో, మరి కొందరికి రిషీకేశ్ లో చికిత్స చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఎనిమిది మందిని డెహ్రాడూన్ కి తీసుకువెళ్లారు. ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై దర్యాప్తు జరుగుతోంది.
మరిన్ని వార్తలు