13 ఏళ్ల బాలికపై అత్యాచారం

29 Jun, 2016 20:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని మదిపూర్ ప్రాంతానికి చెందిన శివగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం బాలికకు మాయమాటలు చెప్పి అతడు తన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

ఈ దురాగతాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో అదే రోజు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్(376), పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు