ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మృతి

6 Aug, 2018 12:43 IST|Sakshi

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గడ్‌లోని గొల్లపల్లి కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 14మంది మవోయిస్టులు మరణించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు​ పోలీసు అధికారులు తెలిపారు. కాగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 42 మంది మవోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి తీరని నష్టం జరుగుతోంది.

మరిన్ని వార్తలు