మీరట్: ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఫ్లెక్సీలపై అందరూ చూస్తుండగా కోడిగుడ్లు, ఇంకుతో దాడి చేశారనే ఆరోపణల కింద పోలీసులు 150మందిపై కేసులు నమోదుచేశారు.
నాలుగు రోజుల కిందట ఇక్కడ కొందరు వ్యాపార వేత్తలు, బులియన్ ట్రేడర్లు ఆందోళనను నిర్వహిస్తూ మోదీ, జైట్లీ ఫ్లెక్సీలపై భారీ ఎత్తున కోడి గుడ్లు విసిరారు.. ఇంకు చల్లారు. దీంతో పోలీసులు వారిపై 147, 341, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.