భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు

26 Jun, 2020 09:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటలలో అత్యధికంగా 17,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 407 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,401కు చేరుకోగా, మొత్తం 15,301 మంది మరణించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,89,463గా ఉంది. ( సినీ నటుల ఇళ్ల వద్ద కరోనా కలకలం )

కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,85,636 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,15,446.. ఇప్పటి వరకు 77,76,228  కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. కాగా, గురువారం ఒక్కరోజే 16,922 కొత్త కేసులు నమోదు కాగా, మరో 418 మంది బాధితులు మృత్యువాతపడ్డారు.

మరిన్ని వార్తలు