జైపూర్: తండ్రి స్కూలు ఫీజు కట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజస్థాన్ లో బుధవారం చోటు చేసుకుంది. అధికారుల కథనం ప్రకారం...శిల్ప కుమార్(18) 12 వ తరగతికి చదువుతోంది. తండ్రి స్కూలు ఫీజు ఇవ్వడానికి నిరాకరించడంతో మనోవేదనకు గురైన శిల్ప ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆమెను ఉదయ్ పూర్ లోని ఎమ్ బీ ఆస్పత్రికి తరళించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించిందని అధికారులు తెలిపారు.