'తాబేళ్ల' కేసులో ముగ్గురి అరెస్టు

11 Jan, 2015 14:02 IST|Sakshi

హౌరా(పశ్చిమబెంగాల్): తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను హౌరా పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్టు అటవీ అధికారులు తెలిపారు. గులాదోర్ సమీపంలో 6వ నంబరు జాతీయ రహదారిపై డివిజనల్ అటవీ అధికారులు సయ్యద్ హుస్సేన్, అంజన్ గుహలు ఆంధ్రప్రదేశ్ నుంచి 2 వేల తాబేళ్లు ఉన్న వాహనం పట్టుకున్నామని తెలిపారు. వాహనంలో ఉన్న ముగ్గురిని అరెస్టు చేసి రెండు వేల తాబేళ్లను సురక్షిత ప్రాంతానికి తరలించామన్నారు.
 

మరిన్ని వార్తలు