అగంతకుల కాల్పుల్లో ఇద్దరు మృతి

28 Feb, 2016 10:47 IST|Sakshi

ఢిల్లీ: న్యూఢిల్లీలోని బదార్‌ పూర్‌ ఏరియా టోల్‌ప్లాజాలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టోల్‌ప్లాజాలో ఉన్న ఇద్దరు (క్యాషియర్‌, సెక్యూరిటీ గార్డు) వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం నగదు ఎత్తుకెళ్లారు.

వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ క్యాషియర్‌, సెక్యూరిటీ గార్డు చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు