అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఆపై ఉరి

29 May, 2014 02:34 IST|Sakshi

బాదౌన్: అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు బాలికలపై కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని చెట్టుకు ఉరేసి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని బాదౌన్ సమీపంలో కాట్రా గ్రామంలో జరిగింది. బాలికలు ఇద్దరూ మంగళవారం రాత్రి అదృశ్యమై, బుధవారం ఉదయం గ్రామంలోని ఓ మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వీరి వయసు 14-15 సంవత్సరాలు.

>
మరిన్ని వార్తలు