ఘోర రోడ్డు ప్రమాదాలు; 21 మంది మృతి

25 Jul, 2016 18:01 IST|Sakshi

చెన్నై: ఒకేరోజు జరిగిన రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 21 మంది మరణించగా, మరో తొమ్మిదిమంది గాయపడ్డారు. సోమవారం బిహార్లో ముజఫర్పూర్ జిల్లాలో బస్సు, ఆటోను ఢీకొన్న ప్రమాదంలో 14 మంది మరణించారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

తమిళనాడులోని థేని జిల్లా దేవదానపట్టి సమీపంలో ప్రభుత్వ రవాణ బస్సు, వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ఏడుగురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కేరళకు చెందినవారిగా గుర్తించారు.

మరిన్ని వార్తలు