దేశ రాజధానిలో కరోనా విజృంభణ

14 Jun, 2020 10:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,134 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,958కి చేరుకుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాజధానిలో 24 గంటల్లో 57 మంది మరణించగా.. మొత్తం 1,271మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 22,742గా ఉంది. ఇప్పటివరకు 14,945 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా, ఢిల్లీలో కరోనా కేసులు 40 వేలకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు అమిత్‌షా నేతృత్వంలో అధికారులు సమావేశం కానున్నారు. ఢిల్లీలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

చదవండి : భారత్‌లో కొత్తగా 11,929 కరోనా కేసులు

మరిన్ని వార్తలు