ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

17 Oct, 2016 23:31 IST|Sakshi
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

భువనేశ్వర్: ఒడిశాలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్‌లోని ఎస్యూఎమ్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటనలో 22 మంది మృతి చెందారు. డయాలసిస్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలంటుకోవడంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో పాటు పలువురు సిబ్బంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని స్థానికంగా గల క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్‌యూఎమ్ ఆసుపత్రికి పట్టణంలో ప్రముఖ ఆసుపత్రిగా పేరుంది.
 

మరిన్ని వార్తలు