ఇద్దరు వ్యక్తులు -23 కిలోల బంగారం

25 Aug, 2014 19:52 IST|Sakshi
ఇద్దరు వ్యక్తులు -23 కిలోల బంగారం

చెన్నై: చెన్నై రైల్వేస్టేషన్‌లో పోలీసులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. అనుమానాస్పద పరిస్థితులలో పోలీసులు ఇద్దరు వ్యక్తుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేశారు. వారి వద్ద 23 కిలోల బంగారం ఉంది. ఆ బంగారం విలువ 5 కోట్ల 75 లక్షల రూపాయలు ఉంటుంది.

ఆ  బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఆ ఇద్దరు వ్యక్తులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు