ఢిల్లీలో గ్యాంగ్‌వార్‌

19 Jun, 2018 03:57 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు నేరగాళ్ల ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్‌ సభ్యులతోపాటు దారిన వెళ్తున్న మరో ఇద్దరు చనిపోయారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతం లో బలవంతపు వసూళ్లు, హత్య కేసుల సంబంధమున్న టిల్లు, గోగి గ్యాంగ్‌లు పనిచేస్తున్నాయి. టిల్లు గ్యాంగ్‌ వాహనాన్ని, గోగి గ్యాంగ్‌ సభ్యుల వాహనం ఢీకొంది. దీంతో ఈ రెండు ముఠాల సభ్యులు పరస్పరం కాల్పులకు దిగారు.

మరిన్ని వార్తలు