ట్రాక్టర్‌ ఇంట్లోకి దూసుకెళ్లి.. ముగ్గురి మృతి

9 Oct, 2017 16:18 IST|Sakshi

జైపూర్‌: వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులు శిథిలాల కింద పడి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రాజస్థాన్‌లోని ఝల్‌వార్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ట్రాక్టర్‌ డ్రైవర్‌ పై కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు