బిహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం

20 Sep, 2016 09:13 IST|Sakshi
బిహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం

పాట్నా: బిహార్ లో విషాదం చోటు చేసుకుంది. మధుబని నుంచి  సీతామండికి వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు  ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ లభించలేదు.  పాట్నాకు 50 కి.మీ దూరంలో ఉన్న  మధుబని జిల్లా బానపట్టి బసాకా చౌక్ లో సోమవారం ఈ దుర్ఘటన  చోటు చేసుకుంది.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారని, గల్లంత అయిన వారికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటన పట్ల బిహార్ సీఎం నితీష్ కుమార్ తీవ్ర  దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

 

మరిన్ని వార్తలు