డిజిటల్‌ రంగంలో 40 లక్షల ఉద్యోగాలు

2 May, 2018 17:21 IST|Sakshi

సాక్షి, న్యూడిల్లీ : కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశ పెట్టిన కొత్త టెలికాం పాలసీ ‘నేషనల్‌ డిజిటర్‌ కమ్యునికేషన్‌ పాలసీ 2018’  డ్రాఫ్ట్‌ ద్వారా 2022 కల్లా డిజిటల్‌ కమ్యునికేషన్‌ రంగంలో దాదాపు 40 లక్షల ఉద్యోగావకాశాలు ఏర్పాడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పాలసీ ద్వారా 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి​ వినియోగాదారుడికి దాదాపు 50 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్‌నెట్‌ సేవలు అందించనున్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో డిజిటల్‌ కమ్యునికేషన్‌ వాటా 6 శాతంగా ఉంది. ఈ పాలసీ ద్వారా అది 8 శాతానికి పెరగనుంది. 

మరిన్ని వార్తలు