నమస్తే ట్రంప్‌ ‘టీవీ’క్షకులు 4.60 కోట్లు!

28 Feb, 2020 17:24 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బీఏఆర్‌సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్‌ మినిట్స్‌ నమోదైనట్లు ప్రభుత్వానికి బీఏఆర్‌సీ సమాచారమిచ్చింది. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి వీక్షించిన వారికంటే ఇది రెండింతలు కావడం విశేషం. ఆస్కార్‌ అవార్డుల వేడుకను దాదాపు రెండున్నర కోట్ల మందిపైగా వీక్షించినట్టు తెలుస్తోంది. నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి విచ్చేసిన ట్రంప్‌, మెలనియాలకు లక్ష మందిపైగా ప్రజలు స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన జనంతో మొతెరా స్టేడియం కిక్కిరిసింది. (చదవండి: హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా)

మరిన్ని వార్తలు