రైలుకు తప్పిన పెను ముప్పు

13 Jan, 2015 16:50 IST|Sakshi
ఐదు కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించి ఏకంగా ఓ రైలునే పేల్చేయాలనుకున్న మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జార్ఖండ్లోని రైల్వే ట్రాక్పై మావోయిస్టులు అమర్చిన 5 కిలోల పేలుడు పదార్థాలను బాంబు స్క్వాడ్ గుర్తించింది. దాంతో వెంటనే వాటిని నిర్వీర్యం చేశారు.
 
ముందుగానే బాంబులు పెట్టిన విషయాన్ని గుర్తించి, దాన్ని తీసేయడంతో.. ఆ మార్గంలో ప్రయాణించే రైలుకు పెను ప్రమాదం తప్పింది. లేనిపక్షంలో పెద్ద మొత్తంలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం సంభవించేదని అన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు