పంజాబ్ లో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

24 Sep, 2016 16:08 IST|Sakshi

ఫరీద్ కోట్ః పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన ఓ మహిళను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.

ఫజిల్కాకు చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు కోటక్ పుర నుంచి ముక్త్ సర్ కు కారులో బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న కారు కోటక్ పురా పోలీస్టేషన్ పరిథిలోకి వచ్చేసరికి ఘోర ప్రమదానికి గురైంది. అతి వేగంగా వెడుతున్న డ్రైవర్ అదుపు తప్పడంతో కారు  కోటక్ పురాకు రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డుపక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టిందని,  ప్రమాదంలో ఐదుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో గురుదయాల్ సింగ్, ఆయన భార్య విమల, ఇద్దరు కొడుకులు హరీందర్, రమేష్ ల తో సహా మనుమరాలు ఆర్తీ కూడా ఉన్నట్లు గుర్తించారు. గురుదయాల్ కుమార్తె సునీతకు తీవ్ర గాయాలవ్వడంతో ఆమెను కోటక్ పుర ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు