న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో సబ్సిడీయేతర వంటగ్యాసు సిలిండర్ ధరను రూ. 5 మేరకు పెంచినట్లు ఆదివారం చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 610కి చేరుకుంది. విమాన ఇంధనం ధర 8.2 శాతం పెరిగింది.