తమిళనాడులో లోయలో పడ్డ కారు, ఆరుగురి మృతి

30 Oct, 2013 17:22 IST|Sakshi

తమిళనాడులో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. తిరునల్వేలి జిల్లాలో కారులో ప్రయాణిస్తుండగా అది ప్రమాదవశాత్తూ వంతెనను ఢీకొంది. అనంతరం డ్రైవర్ కారును నియంత్రించలేకపోయాడు.

వంతెనను ఢీకొట్టిన అనంతరం కారు అదుపుతప్పి పక్కనే లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు మరణించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

మరిన్ని వార్తలు