స్కూల్ బస్సులో మంటలు: విద్యార్థులకు గాయాలు

19 Sep, 2014 08:27 IST|Sakshi

బిజ్నోర్: విద్యార్థులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్, స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని నజీబాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో రావల్ హదీ రైల్వే క్రాసింగ్ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 17 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు