సబర్మతీ నదిలో మునిగిపోయిన ఆరుగురు యువకులు

19 Aug, 2016 09:56 IST|Sakshi

అహ్మదాబాద్: విహార యాత్ర వారిపాలిట మృత్యువుగా మారింది. శబర్కంత  జిల్లాలోని రస్లోడ్ గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు సబర్మతీ నదీ తీరంలోని గల్టేశ్వర్ లో ఉన్నపురాతన శివాలయం దగ్గరికి విహారయాత్రకు గురువారం వెళ్లారు. అనంతరం స్నానం చేయడానికని నదిలోకి దిగి మునిగి పోయారని పోలీసు అధికారి తెలిపారు. స్థానిక మత్సకారుల సాయంతో శవాలను వెలికితీశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం  ఆసుపత్రికి తరళించారు. ప్రమాదవశాత్తు మరణించినట్టుగా  కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు