ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం

29 Mar, 2019 09:54 IST|Sakshi

నోయిడా : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఓ బస్సు, లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, మరో 30 మంది వరకూ గాయపడ్డారు. యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై రబూపుర వద్ద శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.  క్షతగాత్రుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు