ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం : 8 మంది మృతి

11 Apr, 2019 13:41 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ఫతేబాద్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెలుతున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8మంది మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు