సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు సోకిన క‌రోనా

25 Apr, 2020 08:37 IST|Sakshi

ఢిల్లీ :  కోవిడ్‌-19 మహమ్మారి  భారత్ లోనూ  విజృంభిస్తోంది. ఢిల్లీ నగరంలో లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న సీఆర్ పీఎఫ్ జవాన్లకు కరోనా సోకడం సంచలనం రేపింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌) విభాగంలో 9 మంది జవాన్లకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. 9 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ విభాగంలో పనిచేస్తున్న 47 మందిని సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. ఎన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా ఢిల్లీలో అంత‌కంత‌కూ పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళ‌న క‌లిగిస్తుంది.

మరిన్ని వార్తలు